calender_icon.png 19 June, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లో ఉంది

19-06-2025 12:13:16 AM

ఆర్జీ-1 ఏరియాలో 24 మందికి కారుణ్య ఉద్యోగ 

నియామక పత్రాల అందజేతలో ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్

గోదావరిఖని, జూన్ 18(విజయ క్రాంతి): సింగరేణి భవిష్యత్ యువ ఉద్యోగుల చేతుల్లో ఉందని ఆర్జీ-1 జియం లలిత్ కుమార్ అన్నారు. బుధవారం జీఎం కార్యలయంలో మెడికల్ ఇన్ వాలిడేషన్, మృతి చెందిన ఉద్యోగుల డిపెండెంట్స్ లో (19 మంది పురుషులు 5 మంది మహిళలు) మెత్తం 24 మందికి కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులు ఆర్జీ-1 జీయం అందజేశారు.

ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సీఏండి బలరాం చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించటం జరిగుతుందని అన్నారు. మెడికల్ బోర్డ్ కు దరఖాస్తు చే సున్న వారు వెంటనే ఆన్ ఫిట్ అవటం ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులలో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించటం త్వరిత గతిన అవుతుందని, వీరికి ఆర్జీ-1 ఏరియాలో పోస్టింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు.

అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వటం జరిగిందన్నారు. ఉద్యోగములో చేరబోవు ఉద్యోగులు ఇప్పటి పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగు పరచుకొని కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా పనియే ప్రత్యేక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదే విధంగా ఈ ఉద్యోగ అవకాశం కల్పించిన తల్లి, తండ్రులను గౌరవించాలని  సూచించారు.

ఈ కార్యక్రమంలో పర్సనల్ మేనేజర్ ర వీందర్ రెడ్డి, ఏఐటియుసి నాయకులు రంగు శ్రీను, సిఎంఓఎఐ ప్రతినిధి శ్రావణ్ కుమార్, జిఎం ఆఫీస్ ఇంచార్జ్ రాజు, డిప్యూటి పర్సనల్ మేనేజర్ నాగుల వేణు, సీనియర్ పిఒ హనుమంత రావు, ఫిరోజ్ ఖాన్, సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తదితరులుపాల్గోన్నారు.