13 July, 2026 | 4:54 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ

13-07-2026 04:15 PM

జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా రచ్చపల్లిలో అల్బెండజోల్ మాత్రల పంపిణీ

మంథని, జూలై 13(విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా మంథని మండలంలోని రచ్చపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచితంగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రచ్చపల్లి గ్రామ సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్ పాల్గొని పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని, అర్హులైన ప్రతి చిన్నారికి అల్బెండజోల్ మాత్రలు అందేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు సునీత, సరిత, ఆశా వర్కర్ సునీత, అంగన్వాడీ సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నులిపురుగుల నివారణ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.