26-05-2025 08:32:05 AM
హైదరాబాద్: నేడు దేశరాజధాని ఢిల్లీలో జాతీయస్థాయి ఓబీసీ సమావేశం(National level OBC meeting) జరగనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్(India International Centre)లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. అన్ని రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. ఇప్పటికే తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఢిల్లీ చేరుకున్నారు. ఓబీసీ సమావేశంలో రాష్ట్రం నుంచి బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నారు. బీసీ కులగణన, 42 శాతం రిజర్వేషన్ అమలే ప్రధాన ఎజెండాగా చర్చలు జరపనున్నట్లు సమాచారం.