26-05-2025 08:20:24 AM
రోడ్డు పక్కన నిలబడిన వారిపైకి దూసుకెళ్లిన కారు
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో(Khammam District) ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు పక్కన నిలబడిన వారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. రఘునాథపాలెం మండలం(Raghunathpally Mandal) బుడదంపాడు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. మృతులను కారేపల్లి మండలం జాస్తిపల్లికి చెందిన శారద(38), కార్తీక్(13)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చించిన డ్రైవర్ అనంతరం పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.