21-06-2025 02:23:39 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జూన్ 20 (విజయక్రాంతి) : వైద్యాధికారులు సాధారణ ప్రసవాలు చేసేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణం లోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు వివిధ ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్ కు వచ్చే వారికి వైద్య సేవలు అందించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దంగా ఉండాలన్నారు.
హస్పటల్ వచ్చిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తలు తీసుకునేలా ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే సదరం క్యాంపు నిర్వహించేటప్పుడు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వసతులు కల్పించి సక్రమంగా నిర్వహించాలని సూచించారు. తదుపరి నిర్మాణంలో ఉన్న ఎం సి హెచ్ సెంటర్ భవనాన్ని సందర్శించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. తదుపరి అత్యవసర వార్డు, టీబీ యూనిట్ వార్డు,
జెరియాట్రిక్ కేర్ వార్డు, డే కేర్
కిమోథెరపీ వార్డు, జ్వరం మరియు కోవిడ్ ఐసోలేషన్ వార్డులు పరిశీలించారు. వైద్యసేవలు,మందులు ఇస్తున్నారా లేదా పేషంట్లను అడిగి తేలుసు కోన్నారు. ప్రతి రోజు బ్లడ్ టెస్టుల వివరాలు, రిజిస్టర్లలో నమోదును పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట సూపరింటెండెంట్ సత్యనారాయణ, డాక్టర్ వినయ్ ఆనంద్, డాక్టర్ లక్ష్మణ్, సిబ్బంది తదితరులు ఉన్నారు.