21-06-2025 02:21:48 AM
బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
దేవరకొండ,జూన్ 20 : బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ లు,టై బెల్ట్ లు అమ్ముతూ పేద విద్యార్థులను దోచుకుంటున్నారని ఆరోపించారు.
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఆయన కోరారు.ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, పొట్ట మధు,జామీర్ బాబా,పేట అభి,అంజి, వెంకటేష్ , మహేష్,రవి,తదితరులు పాల్గొన్నారు.