calender_icon.png 26 June, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయాల కోసం 'బనకచార్' పై అభ్యంతరం

25-06-2025 12:03:27 AM

ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్ 24: పోలవరంబనకచర్ల లింక్ ప్రాజెక్ట్‌పై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రులు, నేతలను ఆదేశిం చారు. ఈ ప్రాజెక్టు ద్వారా వరద జలాలనే వాడుకుంటున్నట్లు, తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని స్పష్టం చేశారు.

మంగళవారం ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు..పోలవరం లింక్ ప్రాజెక్టుపై నేతలంతా మాట్లాడాలని, కేవలం రాజకీయం కోసమే తెలంగాణలో కొందరు అభ్యంతరాలు చెబుతున్నారన్నారు. ప్రజ లకు వాస్తవాలు వివరించాల్సిన బాధ్యత మంత్రులు, నాయకులపై ఉందన్నారు. తెలంగాణలో అనుమతులు లేకుండా ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా అభ్యంతరం చెప్పలేదని తెలిపారు.