25-06-2025 12:00:00 AM
డీఎంకే ఎంపీ రాజా
చెన్నై, జూన్ 24: డీఎంకే ఎ ంపీ రాజా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక మూర్ఖుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక సభలో అమిత్ షా మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాల్లో గెలుపొందిన విధంగానే తమిళనాడులో పాగా వేస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై రాజా మాట్లాడు తూ.. ‘మే ము ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్రను చేజెక్కించుకున్నాం. తర్వాత తమిళనాడు’ అ ని అమిత్ షా అన్నట్టు తెలిపా రు.
అయితే ఢిల్లీలో కేజ్రీవాల్ ఒక్కడే కావడంతో ఆయన్ని ఓడించార ని.. మహారాష్ట్ర, హర్యానాలో నూ మీ ఆటలు సాగాయన్నారు. కానీ ఇది తమిళనాడు.. ఇక్కడ పెరియార్, అన్నాదురై, కరుణానిధితో పాటు ద్ర విడయన్ విశ్వాసాల అండ స్టాలిన్కు ఉం దన్నారు. డీఎంకేను ఓడించడం అంత సులు వు కాదని కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ద్రవిడ భావజాలానికి భయపడుతుందన్నారు.