25-06-2025 12:03:41 AM
ఉయ్యూరు కమిషనర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహణ
గుంటూరు, జూన్ 24 (విజయక్రాంతి): విశ్వం యొక్క జ్ఞానమంతా భగవద్గీతలో నిండి ఉన్నదని ఉయ్యూరు నగర పంచాయతీ కమిషనర్ పాయసం వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం కాపుల రామాలయం వద్ద ఏర్పాటుచేసిన మహాభారత ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
దుఃఖా నికి కలవరం చెందని వ్యక్తి, సుఖం కోసం పాకులాడని వ్యక్తి, అనుబంధాలు, భయం, కోపం వంటివి అధికంగా చూపించని వ్యక్తి జ్ఞానితో సమానమని చెప్పే గొప్ప ఇతిహాసమే భగవద్గీత అని తెలిపారు. ప్రతి ఒక్కరూ భగవద్గీత లోని శ్లోకాలను చదివి, వాటిని అర్థం చేసుకొని పరమాత్ముడికి దగ్గరగా జీవించాలని తెలిపారు. తదుపరి భక్తులకు ఉచితంగా భగవద్గీత పుస్తకాలను అందజేశారు.