21-06-2025 11:39:16 AM
డయోరీయా (అతిసారం) దరి చేరకుండా చేతులు కడుకుందాం..
ఆరోగ్య సందేశాలు.. ప్లెక్సీచార్ట్ లతో విస్త్రుత ప్రచారాలు తప్పనిసరి
పెన్ పహాడ్ : చిన్న చిన్న పొరపాట్లు.. అలవాట్లు.. కొంత నిర్లక్ష్యం మూలంగా పెద్ద ప్రాణానికి ముప్పు తలపెడుతాయి 'డయోరీయా" వ్యాధి అని చెప్పవచ్చు. ప్రస్తుతం వర్షాకాలం సమీపిస్తున్నందున సీజినల్ వ్యాధులలో భాగంగా ఈ వ్యాధి ప్రభలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అందుకు వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు ఆరోగ్య సందేశాలు.. ఫ్లెక్సీ చార్టుల ద్వారా విస్తుత ప్రచారాలు నిర్వహించాలి. మానసిక ఒత్తిడిల్లు, కొన్ని రకాల ఆహారాలు, కలుషిత తాగునీరు అతిసార వ్యాధికి దారి తీస్తుందని చెప్పవచ్చు. అతిసార వ్యాధిని పూర్వం 'కలరా' అని పిలిచేవారు. మనిషి చనిపోతే కలరా.. బతికి ఉంటే అతిసార వ్యాధి కింద పరిగణించేవారు. ప్రధానంగా పిల్లల్లో పోషక ఆహారాలు, కలుషిత తాగునీరు కారణంగా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఏందీ అతిసారం..
రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నీటితో కూడిన మల విసర్జన జరగడం.. ఆనీటి మలంలో లవణాలు, ఎక్కువశాతం నీరుతో విసర్జన జరుగుతుండం అతిసార (డయోరీయా) వ్యాధిగా చెప్పవచ్చు. వృద్ధులు, పిల్లల్లో అతిసార వ్యాధి వ్యాపిస్తే మరణ ప్రమాదానికి దారి తీస్తుంది. దీంతో శరీరంలో నీరు, లవణాలు పోవడం విరోచనాలు కావడం.. దీంతో మనిషికి కడుపునొప్పి, వాంతులు, బలహీనం, అలసట సంభవిస్తుంది.
పరిశుభ్రతే.. ప్రథమ చికిత్స
ప్రధానంగా పిల్లల్లో అతిసారం వ్యాధి సంభవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు పెర్కోంటున్నారు. వర్షాకాలం ప్రారంభం అవుతున్నందున అతిసార నివారణ చర్యలు మన చేతులోనే ఉంది. పిల్లలకు ఆరోగ్య సూత్రాలపై మరింత అవగహన కల్పించాల్సింది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బందిపై ఉంది. అతిసార వ్యాధి మన ధరి చేరకుండా ముందస్తుగా పరిశుభ్రతనే ప్రధమ చికిత్సని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకు ఈ ప్రధాన సూత్రాలు పాటిస్తే అతిసారం కనుచూపు మేర ప్రాలదోల వచ్చు. ప్రాధానంగా పిల్లలు, వృద్ధులు, ప్రతి ఒక్కరు చేతులు కడుక్కోని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలి. శుద్ధమైన తాగు నీటిని సేవించడం వల్ల అతిసారం వ్యాప్తి చేసే బ్యాక్టీరియా దూరమై పోతుంది. అంతేకాదు ఇంట్లోనే రుచికరమైన వంటలు చేసుకొని తినాలే తప్పా బయట తినే అలవాటును తగ్గించుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నారు. అంతేకాదు టాయిలెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరచ్చడం, ఆరుబయట మలవిసర్జనను స్వస్తి పలకడం వంటి అలవాటు పరుచుకోవాలి.
అనుమానం వచ్చిందా.. చిన్న ఉపాయం..!
ఏమాత్రం అతిసారం వచ్చిందని అనుమానం వచ్చిందా వెంటనే 'ఓఆరెఎస్' ద్రావకం సేవించినట్లయితే మీకు కొండంత రక్షణగా ఉంటుంది. ఈ ఓఆర్ఎస్ ద్రావకం తయారు చేసుకోవడానికి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని వైద్య సిబ్బంది చెబుతున్నారు. 1లీటర్ నీటిలో 1చెంచా ఉప్పు, 6చెంచల చెక్కర కలుపుకొని సేవించాలని లేదా అన్ని కిరాణం షాపులలోనే కాదు మీ గ్రామములోని ఆశాలు, అంగన్వాడీల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అతిసారం ప్రాణాంతకం అయినప్పటికి ప్రథమ చికిత్స మన చేతులోనే నివారణ మార్గం వైపు ఉందని శ్రుతిమించితే వైద్యులను ఆశ్రయించాలి.
అతిసారంపై నిర్లక్ష్యం వద్దు.. ఆరోగ్య సందేశాలు, ప్రచారాలు తప్పనిసరి : డాక్టర్. కోటి రత్నం (డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ-సూర్యాపేట)
అతిసారం (డయోరీయా) వ్యాధి పట్ల చిన్న నిర్లక్ష్యం.. ఏమాత్రం పొరపాటు చేసిన అతిసార వ్యాధిని కొని తెచ్చుకున్నట్లే. ఈవ్యాధి నివారణ మార్గాన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. తమ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బజారులో తినడం మానేయ్యాలి. ఆరుబయట విసర్జన, పలు సమయాలలో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇవన్నీ వైద్య సిబ్బంది ద్వారా ప్రచారాలు చేపట్టుతున్నాం. అంతేకాదు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రార్ధన సమయంలోనే ఈ విషయాలన్నీ పిల్లలకు ఆరోగ్య సందేశాలుగా వివరించాలి. అలాగే ఈ నెల 16 నుంచి వచ్చే 31 వరకు మాసోత్సవాలు భాగంగా అంగన్వాడీ, పల్లె దవాఖానా, గ్రామ పంచాయతీ, పబ్లిక్ ప్లేస్లలో ప్లెక్సీచార్ట్ లతో పలు విస్తుత ప్రచారాలు చేపట్టే విధంగా వైద్యారోగ్య శాఖ ఆద్వర్యంలో ముందుకు పోతున్నాం.