21-06-2025 10:59:46 AM
- ఎంపీడీఓ శ్రీనివాస్ రావు
పెన్ పహాడ్ : మనిషి జీవితానికి ఆయుష్.. నడవడి పెంచేది యోగాసనాలని ఎంపీడీవో శ్రీనివాస్ రావు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనంతారం గ్రామంలోని ఆవుల చెరువు కట్టపై పనిచేస్తున్న ఉపాధి కూలీలతో కలిసి అంతర్జాతీయ యోగ దినోత్సవంలో(International Yoga Day) భాగంగా కూలీలతో కలిసి యోగాసనాలు నిర్వహించారు. సందర్భంగా యోగాసనాల ప్రాధాన్యత పై వివరించారు. మానవ శరీరానికి తేజస్సు మనసుకు ప్రశాంతను ఇచ్చేది యోగా అన్నారు. అంతేకాదు గుండె జబ్బులు, బిపి, డయాబెటిస్, మానసిక ఒత్తిళ్లకు యోగ ఉపశమనం, విద్యార్థులలో చదువుపై ఏకాగ్రత పెంచుతుందన్నారు. కార్యక్రమం లో ఈపిఓ రవి ఈసి చందా మహేష్, ఏక స్వామి, ఫీల్డ్ అసిస్టెంట్ బేగం, ఉపాధి కూలీలు తదితరులు ఉన్నారు