calender_icon.png 23 June, 2025 | 3:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినియోగంలోకి ట్రాన్స్‌ఫార్మర్లు స్పందించిన అధికారులు

23-06-2025 12:00:00 AM

‘విజయక్రాంతి’కి ప్రజల కృతజ్ఞతలు 

గజ్వేల్, జూన్ 22: లో వోల్టేజ్ సమస్య ఎదుర్కొంటున్న విద్యుత్ వినియోగదారులకు విజయక్రాంతి కథనం ఉపశమనం కలిగించింది. మంజూరైన ట్రాన్స్ఫార్మర్లు బిగించకుండా కాంట్రాక్టర్ నివాస ప్రాంతంలో నీరుపయోగంగా ఉన్నాయంటూ శనివారం విజయక్రాంతి ’అవసరానికా....  అమ్మకానికా’ అనే శీర్షికన ప్రచురించింది. దాంతో స్పందించిన అధికారులు ట్రాన్స్ఫార్మర్లను అక్కడ నుండి తరలించారు.

విజయక్రాంతి వరుసగా ప్రచురిస్తున్న వార్త కథనాలతో జిల్లా అధికారులు డివిజన్, మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాంతో నిరుపయోగంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్లను వర్గల్ మండలంలోని నెంటూర్, నాచారం, గౌరారం గ్రామాలలో ఒక్కొక్కటి చొప్పున, గజ్వేల్ పట్టణంలోని త్రీఫేస్ విద్యుత్ సరఫరా కోసం మరో రెండు ట్రాన్స్ఫార్మర్లను బిగించినట్లు ఏఈ వాసుదేవరావు వెల్లడించారు.

గజ్వేల్ పరిధిలో గల ప్రధాన విద్యుత్ లైన్ల అనుసంధానం కోసం త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్లను తెప్పించామని పలు కారణాలతో బిగింపు ఆలస్యమైందని తెలిపారు. విజయక్రాంతి కథనం అధికారులను కదిలించింది, దాంతో గ్రామాలలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యను ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కార మార్గం లభించింది.  నెంటూర్, నాచారం, గౌరారం, గజ్వేల్ గ్రామాల ప్రజలు విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.