calender_icon.png 23 June, 2025 | 10:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ పాఠశాలలకు ఫీజులపై ఉన్న దృష్టి క్రీడలపై ఏది?

23-06-2025 12:11:02 AM

తల్లిదండ్రులు పాఠశాలల్లో పిల్లలను చేర్చించే ముందు క్రీడల గురించి కూడా ఆరా తీయాలి

ఘట్ కేసర్, జూన్ 22 : ఉమ్మడి ఘట్ కేసర్ మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు క్రీడలపట్ల ఉదాసీన వైఖరి అవలంభి స్తున్నాయి. ఫీజులపై ఉన్న దృష్టి క్రీడలపట్ల చూపడంలేదు. శరీర దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి ఉపయుక్తంగా ఉండే క్రీడలను విద్యార్థులకు నేర్పించేందుకు ప్రైవే ట్ పాఠశాలల యజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

ఉమ్మడి మండల పరిధిలో ఉన్న 80 శాతం పాఠశాలల్లో క్రీడలప ట్ల శ్రద్ధ చూపడం లేదు. విద్యార్థుల్లో అడుకోవాలని తపన ఉన్నప్పటికీ బ్యాగులనిండా పుస్తకాలే తప్ప ఈ పాఠశాలల్లో క్రీడలపట్ల పట్టింపు లేదని చెప్పవచ్చు. విద్యా సంవత్స రం ఆరంభంలో ఆకాశానంటే విధంగా ప్ర చార ఆర్భాటాలను చేసే పాఠశాలలు క్రీడల పై సీతకన్ను వేయడం విచారకరం.

ప్రచార హంగామాలతో విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆకర్షించేందుకు నానారకా లుగా తంటాలుపడే ఆయా పాఠశాలల యజమానాలు క్రీడల సౌకర్యాల గురించి అంతగా ప్రచారం చేయవు. తమ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉత్తమ శిక్షణ అని, క్రమశిక్షణకు మారుపేరు అని ఫోన్ రి కార్డులు కరపత్రాలు వాల్ పోస్టర్ల ద్వారా ప్ర చారం చేసే పాఠశాలలు ప్రకటనలలో మా త్రం క్రీడల ఊసే ఎత్తకపోవడం ఆచర్యాన్ని కలిగిస్తుంది.

పిల్లలను చేర్చించే తల్లిదండ్రుల కు కూడా క్రీడల ప్రోత్సాహానికి ఆపాఠశాల ల్లో కల్పిస్తున్న సౌకర్యాలపై అంతగా పట్టించుకున్న పాపానపోవడంలేదు. ఎంతసేపు డోనేషన్లు, పుస్తకాలు హోంవర్కుల గోలే తప్ప పాఠశాలలకు ఆట స్థలం ఉన్నదా, వ్యా యామ ఉపాధ్యాయులు ఉన్నారా, అవి ఏ మి గమనించ కుండా చూసిచూడనట్లు ఉం డిపోతున్నారు.

వేలాది రూపాయలు డోనేషన్ల రూపంలో దండుకుంటున్న పాఠశాల లు పిల్లలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి. సాధార ణంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు గుర్తింపు ఇవ్వాలంటే క్రీడాస్థలాలను కూడా పర్యవేక్షించిన తరువాతే అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగానే అ నుమతులు ఉంటున్నాయి. ఈపాఠశాలలు నిబంధనలకు నీళ్లు వదిలేస్తున్నాయి.

మానసిక ఉల్లాసానికి క్రీడలు

రోజంతా చదువులతో విసిగివేసారిన విద్యార్థులకు క్రీడలు మానసికంగా ఉల్లాసాన్ని ఇస్తాయి. ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పాఠశాలల్లో వివిధ సబ్జెక్టుల అంశాల్లో తరగతు లు వింటూ తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. మధ్యాహ్నం భోజన విరామ సమయం మినహా ఇతర సమయమంతా బెంచీలకు అతుక్కుపోయి విద్యాభ్యాసం వైపే దృష్టి మ ల్లించాల్సి ఉంటుంది.

ఇలా పాఠశాలల్లోనే తీవ్రఒత్తిడికి లోనవుతూ ఇంటికి వెళ్లిన విద్యార్థులకు ట్యూషన్లు గుదిబండలా కనిపిస్తా యి. ఈతరుణంలో విద్యార్థులు మానసికం గా నలిగిపోతుంటారు. నిరంతరం విద్యాభ్యాసంపైనే గడిపే కన్నా రెండు, మూడు గంట లు క్రీడలపట్ల మనస్సు మల్లిస్తే ఉల్లాసంతో పాటు శరీర దారుఢ్యం కూడా పిల్లల్లో కలుగుతుంది. పాఠశాలల్లో ఉన్నంత సేపు విద్యా ర్థులను చదివించడం వరకే మావంతు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

పాఠశాల స్థాయి నుంచి శిక్షకుడి పర్యవేక్షణలో నేర్చుకున్న క్రీడలకు ఎదిగిన వయస్సులో నేర్చుకునే క్రీడల కు వ్యత్యాసం చాలా ఉంటుంది. తల్లిదండ్రు లు కూడా పాఠశాలల్లో పిల్లలను చేర్చించే ముందు క్రీడల గురించి కూడా ప్రశ్నిస్తే బా గుంటుంది.

పాఠశాలలువిధ్యాబ్యాసానికి మా త్రమే కాదని క్రీడాబ్యాసానికి కూడా దో హదపడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కో రుకో వాలి. క్రీడలను ప్రోత్సహించని ప్రైవే టు పాఠశాలల యజమాన్యాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.