9 March, 2026 | 5:28 PM

Breaking News

మహిళా హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు   •   బీజేపీ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బీఆర్‌ఎస్‌లో చేరిక   •   హెచ్పీవీ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి   •   ప్రజా వాణిలో వచ్చిన ధరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి   •   కళాజాత ప్రదర్శనల ద్వారా ప్రజలను చైతన్య వంతులుగా చేయాలి   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు   •   అర్జీలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు   •   ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి పెట్టాలి   •   ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు   •   శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ బీమా చెక్కు అందజేత   •  

ఆస్తి పన్ను చెల్లింపునకు వన్ టైమ్ సెటిల్ మెంట్

27-03-2025 12:41 AM

పటాన్ చెరు, మార్చి 26 :మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లింపులకు ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్ మెంట్ కు అవకాశం కల్పించినట్లు తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్సిపల్ కమిషనర్ లు సంగారెడ్డి, జ్యోతిరెడ్డి, మధుసూదన్ రెడ్డిలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబందించిన ఆస్తి పన్నుఒకే సారి చెల్లించే వారికి పెనాల్టీపై  ప్రభుత్వం 90శాతం రాయితీ కల్పించిందన్నారు. 

కేవలం పది శాతం పెనాల్టీతో ఆస్తి పన్ను చెల్లింపుకు అవకాశం ఉందన్నారు. ఈనెల 31వ తేదీలోపు ఆస్తిపన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ లు వేరు వేరు ప్రకటనల్లో కోరారు. మీ సేవా కేంద్రాలలో, సిటిజన్ బడ్డీ యాప్ లో లేదా మున్సిపల్ కార్యాలయంలో ఆస్తి పన్ను చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు.