15 April, 2026 | 1:08 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ

15-04-2026 11:26 AM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో(CM Revanth Reddyతెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల AICC ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం భేటీ అయ్యారు. పార్టీ వ్యవహారాలతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పదవీకాలం ముగిసిన కార్పొరేషన్ ఛైర్మన్ల రెన్యూవల్, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై జిల్లాలో జరిగే భేటీలు, జీవన్ రెడ్డి పార్టీ మార్పుపై చర్చించనున్నారు. నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలు, ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రులపై ఇటీవల వచ్చిన ఆరోపణలతో సహా పార్టీ ప్రస్తుత పరిస్థితిపై ఈ చర్చలు సాగే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి పార్టీ అనుసరించాల్సిన వ్యూహం కూడా ఈ సమావేశంలో ఒక కీలక అంశంగా చర్చకు వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.