10 April, 2026 | 3:52 PM

Breaking News

టూ వీలర్ తో మెకానిక్ చేస్తూ... ఉపాధి   •   అన్నా.. నన్ను దేవుడే పంపిండు— కేసీఆర్‌ను కలిసి జీవన్ రెడ్డి భావోద్వేగం   •   ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •  

పెండింగ్ వేతనాలు చెల్లించాలి

15-04-2025 05:49 PM

ఐఎఫ్టియు రాష్ట్ర నాయకుడు బ్రహ్మానందం...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బిసి హాస్టల్స్ వర్కర్స్ పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఐఎఫ్టియు బ్రహ్మానందం డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ హాస్టల్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికుల 12 నెలల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతినెల వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల వేతనాలు చెల్లించకపోవడం దారుణమని అన్నారు. వేతనాలు మంజూరు చేయకపోతే నిరవధిక సమ్మె కు దిగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి, బీసీ హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొమురయ్య, లక్ష్మి, శారద, పోశక్క, పార్వతి, శకుంతల, సరోజ, సుజాత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.