16 April, 2026 | 12:02 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలి

26-06-2025 07:10 PM

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్...

కరీంనగర్ (విజయక్రాంతి): పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేదించాలని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫుల్ దేశాయ్(Commissioner Praful Desai) అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం రోజు నగరంలో అధికారులతో కలిసి కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ పర్యటించారు. నగర సుంధరీకరణలో భాగంగా ప్రధాన రహాదారులలో డివైడర్స్ & మీడియమ్స్ తో పాటు నగరంలోని బస్టాండ్, తెలంగాణ చౌక్, ఐబీ గెస్ట్ హౌజ్, కోర్ట్, మంచిర్యాల్ చౌరస్తా, బొమ్మకల్ తదితర హైలాండ్ జంక్షన్లను తనిఖీ చేసి పరిశీలించారు. హైలాండ్ జంక్షన్లు మీడియమ్స్ లలో కార్మీకులతో చెత్తను తొలగించి వేయడంతో పాటు కూడళ్ళ రేలింగ్ చుట్టు ఉన్న ఫ్లెక్సీలను తొలగించి వేశారు.

ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరపాలక సంస్థలో 100 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. నగర సుంధరీకరణ లో భాగంగా నగరంలోని డివైడర్స్ మీడియమ్స్ తో పాటు హైలాండ్ జంక్షన్ల లో కార్మీకులు చెత్తను శుభ్రం చేయాలన్నారు. నగరపాలక సంస్థ ద్వారా ప్లాస్టిక్ నివారణ చర్యలో భాగంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి... ప్లాస్టిక్ వాడే వ్యాపారులకు జరిమానా విధిస్తామని తెలిపారు. నగర ప్రజలకు సమయానికి అనుగుణంగా ఇంజనీరింగ్ అధికారులు మంచి నీటిని సరఫరా చేయాలని... త్రాగు నీటి విషయంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ వేణు మాధవ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.