calender_icon.png 4 June, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

02-06-2025 10:27:47 PM

తాసిల్దార్ గోపాలకృష్ణ..

పినపాక (విజయక్రాంతి): భూభారతి గ్రామసభలను అన్ని గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్నామని, ఆ తేదీలను ఖరారు చేసినట్లుగా పినపాక తాసిల్దార్ గోపాలకృష్ణ(Pinapaka Tahsildar Gopalakrishna) తెలియజేశారు. సోమవారం ఆయన పినపాక తాసిల్దార్ కార్యాలయంలో మాట్లాడారు. భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం-2025 అమలులో భాగంగా భూభారతి రైతు సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జూన్ 3 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల వారిగా ఈ సదస్సులు నిర్వహిస్తునట్లు తహసిల్దార్  తెలిపారు.భూ యజమానులు, రైతులు తమ భూమి రికార్డుల యందు ఏమైనా తప్పులు ఉన్నా, అర్హత ఉండి రెవెన్యూ రికార్డుల యందు పేర్లు నమోదు కాకపోయినా, మరి ఇతర భూ సమస్యలు ఉన్నా జూన్ 3వ తేదీ నుంచి 20 తేదీ వరకు నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో రైతులు సమస్యల పరిష్కారం కోసం మీ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సుల్లో దరఖాస్తులు చేసుకుంటే పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని సూచించారు. ఈ అవకాశాన్ని రైతులు,సద్వినియోగం చేసుకోవాలని కోరారు.