ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 21(విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాల ని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిపార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదివారం జైనూర్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె దుకాణ సముదాయాలు తిరుగుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ను గెలిపించాలని కోరారు. చేపలు విక్రయిస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి చేపలు కొనుగోలు చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేపట్టిందని, వ్యవసాయాన్ని పండుగగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వచ్చాక హామీలను విస్మరించిందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఇంతియాజ్ లాలా, గ్రంథాలయ మాజీ చైర్మన్ యాదవరావు పాల్గొన్నారు.