దేశాభివృద్ధి మోదీతోనే సాధ్యం

22-04-2024 12:49:19 AM

జహీరాబాద్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బీబీపాటిల్

జహీరాబాద్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి) : దేశాభివృద్ధి నరేంద్రమోదీ తోనే సాధ్యమవు తుందని జహీరా బాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బీబీపాటిల్ అన్నారు. ఆదివా రం జహీరాబాద్ పట్టణంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో పలు పార్టీ లకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీలో చేరారు. వారికి బీజేపీ కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సమావేశంలో ఆయా మండలాలకు చెందిన పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యక ర్తలు పాల్గొన్నారు.