calender_icon.png 9 June, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి

06-06-2025 12:00:00 AM

ఇంచర్ల ఏకో పార్క్ లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

ములుగు, జూన్ 5  : భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణం అందించేందుకు మొక్కలు నాటి వాటిని పెంచి కాపాడాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రజలకు పిలుపునిచ్చారు.గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవి శాఖ ఆధ్వర్యంలో ములుగు మండల కేంద్రంలోని ఇంచర్ల ఏకో పార్క్ లో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.డిఎఫ్‌ఓ రాహూల్ కిషన్ జాదవ్ తో కలసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని అన్నారు.చెట్టు నీడతోపాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను అందిస్తుందని, చెట్టు నీడ వెలకట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లని  ప్రతి ఒక్కరూ చెట్టు ను నాటి సమాజంలో మార్పు తీసుకురావాలని శుభ కార్యక్రమాల్లో కేకులను కట్ చేసి హంగామా సృష్టించే బదులు మొక్కలు నాడాలని అన్నారు.

చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ ఆర్ ఓ శంకర్,డిప్యూటీ ఎఫ్ ఆర్ ఓ శోభన్,ఎఫ్ ఎస్ ఓ రవీందర్,మమత,ఎఫ్ బి ఓ లు శ్యామ్ సుందర్,శ్యామ్ ప్రసాద్,కిషన్,తదితరులు పాల్గొన్నారు.

నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి..

ములుగు : ఖరీఫ్ సీజన్ లో రైతులు సాగు చేసేందుకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు,పురుగు మందులను సరిపోను విత్తన,ఎరువులు, పురుగుమందుల దుకాణాలలో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.అన్నారు. గురువారం జిల్లా కేంద్రం లోని లక్ష్మి ఫర్టిలైజర్స్,ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తనిఖీ చేశారు.