5 September, 2026 | 12:42 PM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని భేటీ

05-09-2026 | 11:01am

స్క్రీన్ టైమ్ తగ్గేలా చూడడం చాలా అవసరం

విద్యార్థులను అప్ డేట్ చేయాలి

విద్యార్థుల కల సాకారానికి టీచర్ల పాత్ర కీలకం

న్యూఢిల్లీ: ఉపాధ్యాయ దినోత్సవం(Teachers' Day 2026) సందర్భంగా టీచర్లతో ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) సమావేశం అయ్యారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ప్రధాని ముచ్చటించారు. ఈ నేపథ్యంలో టీచర్లకు నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు(Students) చదువుతో పాటు క్రీడలు చాలా ముఖ్యమని సూచించారు. స్క్రీన్ టైమ్(Screen Time) తగ్గేలా చూడటం చాలా అవసరమని పేర్కొన్నారు. నూతన సాంకేతికలపై ఎప్పటికప్పుడు విద్యార్థులను అప్ డేట్ చేయాలని పిలుపునిచ్చారు. బోధనతో విద్యార్థుల్లో చాలా మార్పు తీసుకురావచ్చన్నారు. చదువుతో పాటు డ్రగ్స్ వాడకంపై(Drug abuse) అవగాహన కల్పించడం అత్యంత అవసరమని దిశానిర్దేశం చేశారు.

జాతీయ పురస్కార గ్రహీత అయిన ఒక ఉపాధ్యాయుడితో సంభాషిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇలా అన్నారు. "స్క్రీన్ టైమ్ ఇప్పుడు ఒక రకమైన వ్యసనంగా మారింది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఒకవేళ పిల్లలు క్రీడలపై, అంటే వీడియో గేమ్‌లపై కాదు, మైదానంలో ఆడే నిజమైన ఆటపై, తీవ్రమైన ఆసక్తి చూపడం ప్రారంభిస్తే, వారు క్రమంగా ఆ వ్యసనం నుండి విముక్తి పొందవచ్చు. ఈ నేపథ్యంలో, మనం పిల్లలను సృజనాత్మక కార్యకలాపాలలో ఎంత ఎక్కువగా నిమగ్నం చేస్తే, దానిని ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించడాన్ని మనం అంతగా అలవాటు చేసుకోవాలి'' అని ఆయన పేర్కొన్నారు. 

కొన్ని ప్రధాన నగరాలు లేదా విశ్వవిద్యాలయాలలో వెలుగులోకి వచ్చిన మాదకద్రవ్యాల సమస్య విషయానికి వస్తే, తరచుగా అవగాహన లోపిస్తుందన్నారు. కొన్నిసార్లు ఎటువంటి వివరణ లేకుండానే నిబంధనలను విధిస్తారని ప్రధాని తెలిపారు. నేటి ఉపాధ్యాయులు దీని చుట్టూ ఉన్న పరిణామాలు , భయాల గురించి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. అటువంటి చర్యలు పిల్లలలో ఏవైనా ప్రవర్తనా మార్పులకు కారణమవుతున్నాయో లేదో గమనించాలని కోరారు. నేను మీ అందరితో మాట్లాడుతున్నాను, కానీ మొత్తం విద్యా సమాజానికి కూడా ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నానని ఆయన స్పష్టం చేశారు. మనం పాఠ్యపుస్తకాలు, సిలబస్‌లను దాటి పిల్లల జీవితాలతో నిజంగా మమేకం కావాలపిలుపునిచ్చిన ప్రధాని మోదీ మనం బాల్యాన్ని అంతరించిపోనివ్వకూడదన్నారు. విద్యార్థుల బాల్యాన్ని పరిరక్షించడానికి ఉపాధ్యాయులే అత్యంత సమర్థులని కొనియాడారు.

మరిన్ని వార్తలు