15 June, 2026 | 10:23 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ

12-11-2025 04:10 PM

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ లో రెండు రోజులు పర్యటన ముగించుకుని ఢిల్లీకి వచ్చిన ప్రధాని నేరుగా లోక్ నాయక్ జై ప్రకాష్ (ఎల్‌ఎన్‌జెపి) ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట పేలుడులో గాయపడిన వారిని ప్రధాని వ్యక్తిగతంగా కలుసుకుని సంభాషించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ప్రధాని మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎర్రకోట పేలుడు కుట్రదారులను వదిలిపెట్టబోమని ఆయన హామీ ఇచ్చారు. 

సోమవారం ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడులో కారు ధ్వంసమై 12 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ పేలుడులో మృతదేహాలు ఛిన్నాభిన్నమైన, కార్లు ధ్వంసమయ్యాయి. జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాద మాడ్యూల్‌ను ఛేదించిన తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్ నుండి 2,900 కిలోగ్రాముల ఐఈడీ తయారీ పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న రోజే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు.