29 June, 2026 | 2:53 AM

చక్కని జీవితానికి పోలియో చుక్కలు

29-06-2026 01:54 AM

చేవెళ్ళ మున్సిపల్ ఛైర్ పర్సన్ సమతా వెంకట్ రెడ్డి

చేవెళ్ళ జూన్ 28(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. మున్సిపాలిటీ 3వ వార్డు దేవుని ఎర్రవల్లిలో బీజేపీ కౌన్సిలర్ కారికే మీనాక్షి సత్యనారాయణ మున్సిపల్ ప్రధాన కార్యదర్శి పత్తి సత్యనారాయణ పోలియో చుక్కలు వేయగా నాంచారి గ్రామ పంచాయతీలో పల్స్ పోలియో ఇంద్రారెడ్డి నగర్ కిష్టాపూర్ లో అంగన్వాడి టీచర్ ఆశ వర్కర్స్ వార్డ్ నెంబర్స్తో కలిసి సర్పంచ్ అశోక్ పాల్స్ పోలియో చుక్కలు వేశారు.

రావులపల్లి గ్రామ సర్పంచ్ గోటూరి రాంచంద్రయ్య, తల్లారం గ్రామ సర్పంచ్ లక్ష్మి ప్రసన్న శేఖర్ ఆయా గ్రామాల్లో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ... చిన్నారి చక్కని జీవితానికి రెండు చుక్కలు తప్పనిసరి అన్నారు. ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసారిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజన్ని స్థాపించాలన్నారు.