18 June, 2026 | 1:50 AM

ప్రత్యేక ఓటర్ జాబితా సవరణకు రాజకీయ నాయకులు సహకరించాలి

18-06-2026 12:26 AM

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, జూన్ 17 (విజయక్రాంతి): రాజకీయ పార్టీల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ, ఓటర్ల జాబితా సవరణ విజయవంతం అయ్యేలా సహక రించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కోరారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులకు రాజకీయ నాయకులు సహకరించాకన్నారు. జూన్ 18న బూత్ లెవెల్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గ స్థా యి అధికారులకు క్షేత్రస్థాయి సన్నాహక శిక్షణ ఇస్తారని వివరించారు. జూన్ 25 - జూలై 24వరకు బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి వివరాలను సేక రిస్తారని, 2002 ఓటర్ల జాబితా ఆధారంగా కుటుంబ సభ్యుల వివరాలను ఇందులో నమోదు చేయాల్సి ఉంటుందని తెలిపారు.

జూలై 24 - 30వరకు ప్రతి పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు ఉండేలా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ చేపడతారన్నారు. ఓటర్ల ముసాయిదా జులై 31న  జాబితా  ప్రచురించి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం అక్టోబర్ 1న తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారని అన్నారు.

వరైనా తప్పు సమాచారం ఇస్తే నేరుగా పేరు తొలగించకుండా, ముసాయిదా జాబితా తర్వాత నోటీసు ఇచ్చి, విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. వలస వెళ్లిన వారు, మరణించిన వారు, మరియు డూప్లికేట్ ఓటర్లను గుర్తించి జాబితా నుండి తొలగించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950 లోని సెక్షన్ 31 ప్రకారం, ఓటర్ల జాబితాలో పేరు నమోదు కోసం ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం లేదా తప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఒక సంవత్సరం జై లు శిక్ష, జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని తెలిపారు.

ప్రస్తుత జాబితాలో పేరు లేని కొత్త ఓటర్లు తప్పనిసరిగా ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా ప్రచురణ తేదీ అయిన అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒ క్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మారిన వారు ఫామ్-8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్,  తదితరులు పాల్గొన్నారు.