calender_icon.png 9 June, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వంచ పట్టణ పునర్ వైభవానికి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి

09-06-2025 09:31:13 AM

ఫోరం ఫర్ బెటర్ పాల్వంచ తీర్మానం. 

భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): పాల్వంచ పట్టణానికి(Palvancha Town) పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు, పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రతినిధులపై ఒత్తడి పంచేందుకు కట్టబడి ఉన్నామంటూ ఫోరం ఫర్ బెటర్ పాల్వంచ సభ్యులు స్పష్టం చేశారు.  పాల్వంచ బృందావన్ హోటల్లో నూకల రంగారావు అధ్యక్షతన ఫోరం ఫర్ బెటర్ పాల్వంచ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణానికి చెందిన ప్రముఖులు పాల్గొని మాట్లాడారు. "పాల్వంచ పట్టణానికి  పునర్వైభావానికి ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తెచ్చే బాధ్యత ఫోరం ఫర్ బెటర్ పాల్వంచ తీసుకుంటుందని, పాల్వంచ పట్టణంలో నూతన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థాపన, ఎన్ ఎం డి సి పునర్వ్యవస్థీకరణ, పట్నానికి వివిధ కేంద్రీయ విశ్వ విద్యాసంస్థలస్థాపన, ఐటీ హబ్, ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్ ఏర్పాటు, పాల్వంచ పట్టణానికి చెందిన పట్టణానికి మౌలిక సదుపాయాలు కల్పన  చేపట్టాలనీ అలుపెరగని పోరాటం చేస్తామన్నారు.

ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో, వివిధ రాజకీయ పార్టీలతో,ప్రజా సంఘాలతో, వివిధ అసోసియేషన్లతో, చర్చించి నిర్ణయం తీసుకోవాలనీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పాల్వంచ పరిశ్రమలకు అనువైన ప్రదేశం. పాల్వంచ కరకవాగు ప్రాంతంలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయాలని ,కిన్నెరసాని అభివృద్ధి చేసి జూ పార్క్ ఏర్పాటు చేయాలని, త్వరలో పాల్వంచ పట్టణంలో ప్రజల సందేహాలని నివృత్తి చేయడానికి స్థానిక ఎమ్మెల్యే , అధికారుల తో సమావేశం నిర్వహించడానికి కృషి చేస్తామన్నారు. 

పాల్వంచ అభివృద్ధి కోసం ఫోరమ్ ఫర్ బెటర్ పాల్వంచ రాజీ లేని పోరాటం చేస్తుంది. పర్యాటక రంగపరంగా పాల్వంచని అభివృద్ధి చేసి టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలనీ సమావేశం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో ముంతపురి రాజు గౌడ్, కాల్వ భాస్కర్, బుడగం రవి, కాపా కృష్ణమోహన్, వై.సాంబశివరావు, జమాల్ సైదులు, కట్టా వెంకట నారాయణ, కళ్యాణం లక్ష్మిపతి, పాటిబండ్ల అభినవ్, యడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, బుద్ది కిషోర్, పోనిశెట్టి వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసరావు, తులసి రామ్, ఆరుద్ర సత్యనారాయణ, సాధం రామకృష్ణ, మంజూర్, దున్నపోతుల రాజు, ఆలపాటి ప్రసాద్, నగేష్, చేనుమోలు శ్రీను, సాంబశివరావు, జైన్ కుమార్, రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.