09-06-2025 09:28:52 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) తొర్రూరు వద్ద ముందు వెళ్తున్న లారీని గ్రానైట్ లోడ్ తో వెళుతున్న లారీ ఢీకొనడంతో గ్రానైట్ లారీ డ్రైవర్ బాలరాజు దుర్మరణం పాలయ్యాడు. లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీయడానికి పోలీసులు నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. లారీ క్యాబిన్ పై వెనుక ఉన్న గ్రానైట్ రాళ్లు దూసుకు రావడంతో మృతదేహం అందులో ఇరుక్కుపోయింది. దీనితో భారీ క్రేన్, జేసీబీ తెప్పించి రాళ్లను పక్కకు జరిపి డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీశారు.