09-06-2025 09:34:15 AM
భద్రాద్రికొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే సాంబశివరావు పై తప్పుడు అఫిడివిటీ కేసు పై తీర్పు వెలువడనుంది. దీంతో నియోజకవర్గ యావత్తు ఉత్కంఠ నెలకొంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు(Kothagudem MLA Sambasiva Rao) అఫిడిటిలో తప్పుడు నివేదికలు సమర్పించారు అంటూ కొత్తగూడానికి చెందిన అగ్రవాల్ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వాదోపవాదాలు అనంతరం నేడు తీర్పు వెలువలనుంది.
ఈ క్రమంలో ఎమ్మెల్యే సాంబశివరావు పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టులో చుక్కెదురైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తా అని అన్నట్లు సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంలో గతంలోనూ వనమా వెంకటేశ్వరరావు పై జలగం వెంకట్రావు తప్పుడు ఆఫిటివిటీ పై పిటీషన్ దాఖలు చేశారు. ఐదు సంవత్సరాలపాటు కేసు సాగుతూ చివరకు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎలాంటి తీర్పు రాకుండా పోయింది. ఈసారి కూడా అలానే సాగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీర్పుపై ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.