21 August, 2026 | 10:02 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

యాదాద్రి పరిరక్షణ సమితి, బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్

23-05-2026 08:59 PM

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా 

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట అభివృద్ధి కార్యక్రమాలకు  సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్బంగా యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులను, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు . ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొండపైన 50, 60 సంవత్సరాలుగా వర్తకం తో వ్యాపారాలు నిర్వహించి ఉంటూ  లబ్ధి పొందుతున్నారని కొత్తవారికి అవకాశం లేకుండా దేవస్థానానికి ఆదాయం రాకుండా ఉద్యోగులను రాజకీయ నాయకులను గుప్పెట్లో పట్టుకున్నారని వాళ్లు చెప్పిందే వేదంగా నడుస్తుందని, కొండ కింద భూ నిర్వాసితుడు నిరుద్యోగులు ఎంతోమంది ఉపాధి లేక ఇబ్బందులకు గురవుతున్నారని కొండపైన దుకాణాలను వేలం వేస్తే ఎంతోమందికి లబ్ధి జరుగుతుందని ఈ విషయమై గత నెల రోజులుగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని,  వర్తక సంఘము  వ్యాపారులకు ఎమ్మెల్యే అండదండలు పుష్కలంగా ఉండడంతో వాళ్లు ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నారు.