అర్ధరాత్రి పుట్టినరోజు వేడుకలతో ఇబ్బందులు
కేసు నమోదు చేసిన చైతన్యపురి పోలీసులు
ఎల్బీనగర్, మే 3 (విజయక్రాంతి): అర్ధరాత్రి వేళ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నవారిపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశా రు. వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి 2 గంట ల ప్రాంతంలో చైతన్యపురి పోలీస్ స్టేషన్ బ్లూ కోల్ట్ సిబ్బంది కొత్తపేట నుంచి నాగోల్ వెళ్తూ చిత్తరమ్మ ఆలయం సమీపంలో గస్తీ తిరుగుతున్నారు.
ఇదే సమయంలో కౌశిక్ ఠాకూర్ అలియాస్ లక్కీ అనే వ్యక్తి తన స్నేహితులైన అంధోజ సాయి రామ్, దోసా ద విశాల్రెడ్డి, సయ్యద్ సొహిల్, అంకిత్, ఆరిఫ్, నిహాంత్, వెంకట్, యశ్వంత్ రెడ్డి, నితిన్ తోపాటు ఇతరులతో కలిసి రోడ్డు మీద అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు చేస్తూ, ప్రజలకు అసౌకర్యం కల్పిస్తు న్నారు. వెంటనే వారందరినీ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు.
నిబంధనలు ఉల్లంఘించి అర్ధరాత్రి ప్రాం తంలో షాపులు నడిపిస్తున్న కొత్తపేటలోని పిజ్జా హట్, వికాస్ నగర్ లోని టిల్లు ఫార్మా పాన్ షాపులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సైదులు మాట్లాడుతూ... రోడ్లపై అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకలు, పార్టీ లు, పరిమితిని మించిన సమయంలో షాపు లు నడపడం, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం చట్ట వ్యతిరేకమన్నారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పబ్లిక్ న్యూసెన్స్ గా పరిగణించి, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.






