calender_icon.png 9 June, 2025 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవ్యంగానే సాగు భూమి సహాయం!

10-01-2025 12:00:00 AM

సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామనే నిబంధన తప్ప కాం గ్రెస్ ప్రభుత్వం కూడా ఏ నిబంధన పెట్టడానికి ముందుకు రాలేదు. తొలుత నిబంధనలు పెట్టాలని భావించినప్పటికీ రైతుల నుండి వ్యతిరేకత వస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికలలో రైతు భరోసారాని భూ స్వాములు, పెద్ద రైతులు నష్టం చేస్తారని భావించిన ప్రభుత్వం ఆంక్షలపై వెనుకడుగు వేసిందనే చెప్పాలి.

స్వతంత్ర భారతంలో సాగు చేస్తున్న రైతుకు అన్నీ సమస్యలే. దేశంలోను, తెలంగాణ రాష్ట్రంలోనూ అధిక శాతం సన్న, చిన్నకారు రైతులే. వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో పెట్టుబడి ఒకటి.

వ్య వసాయ కార్యకలాపాల నిర్వహణ కోసం రైతులు వడ్డీ వ్యాపారులపై ఆధారపడటం ఒక సమస్య అయితే సకాలంలో సంస్థాగత పరపతి అందకపోవటం మరొక సమ స్యగా ఉన్న నేపథ్యంలో తెలంగాణలో రైతాంగానికి పెట్టుబడి సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతు బంధు పథకాన్ని ప్రకటించింది.

దేశంలో ప్రభుత్వమే నేరుగా రైతుకు పెట్టుబడి స హాయం అందించే మొదటి పథకంగా ప్ర శంసలు అందుకుంది. ఇప్పటివరకు  రైతుబంధు కింద దాదాపు 69 లక్షల మంది రూ.80 వేల కోట్ల  పెట్టుబడి సహాయం పొందినట్లుగా ప్రభుత్వ గణాంకాలు స్ప ష్టం చేస్తున్నాయి. 

తెలంగాణలో రైతుబంధు పథకం ప్రారంభమైన తర్వాత కేంద్రం  కూడా 2019లో దేశంలోని రైతులకు ఏటా 6000 రూపాయల పెట్టుబడి సహాయం అందించడానికి ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన’ ప్రారంభించింది.

2023 తెలంగాణ  శాసనసభ ఎన్నికల సం దర్భంగా కాంగ్రెస్ పార్టీ రైతుబంధు పథ కం ద్వారా రైతులకు ఏటా ప్రతి ఎకరానికి ఇస్తున్న పదివేల పెట్టుబడిసాయాన్ని రూ. 15వేలకు పెంచుతామనే హామీని మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే  పథకం పేరును రైతు భరోసాగా మారుస్తూ, సాగు చేస్తున్న భూమికి ఏటా ఎకరాకు 12,000 రూపాయలను జనవరి 26 నుండి అమ లు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు. 

ఆంక్షలపై వెనకడుగు 

గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుబంధు ఇవ్వటం వలన సాగు చేయని భూమి, కొండలు, గుట్టలు వెంచర్ భూములకు, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న భూమికి కూడా రైతుబంధు ఇవ్వటం వలన  దాదా పు రూ.21,285 కోట్ల  ప్రజాధనం దుర్వినియోగం అయిందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

కాబట్టి ఈ పథకం అమలులో ఆంక్షలు, నిబంధనలు పెట్టాలనే ప్రతిపాదనలు వివిధ వర్గాలనుండి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అమలు చేయడానికి ఎలాంటి నిబంధనలు పెట్టాలనే విషయంపై రైతుల నుండి అభిప్రాయాలు సేకరించింది.

అలా గే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించింది. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి, ఎవరికి  ఇవ్వాలనే అంశంపై అనేక రకాల ప్రతిపాదనలు వచ్చాయి. ఐదు ఎకరాల వరకే ఇవ్వాలని, సాగు చేసే భూమికే  ఇవ్వాలని, ఐటీ చెల్లింపుదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు ఇవ్వకూడదనే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. 

సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామనే నిబంధన తప్ప కాం గ్రెస్ ప్రభుత్వం కూడా ఏ నిబంధన పెట్టడానికి ముందుకు రాలేదు. తొలుత నిబం ధనలు పెట్టాలని భావించినప్పటికీ రైతుల నుండి వ్యతిరేకత వస్తుందని, స్థానిక సం స్థల ఎన్నికలలో రైతు భరోసా రాని భూ స్వాములు, పెద్ద రైతులు నష్టం చేస్తారని భావించిన ప్రభుత్వం ఆంక్షలపై వెనుకడుగు వేసిందనే చెప్పాలి. 

ప్రభుత్వం రైతు భరోసా లబ్ధికి భూ గరిష్ఠ పరిమితి పెట్టకపోవడం వలన పెట్టుబడి అవసరం ఉన్న సన్న, చిన్న కారు రైతులకంటే పెట్టుబడి సహాయం అవసరం లేని పెద్ద రైతులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.  5 ఎకరాలలోపు భూమి ఉన్న 59 లక్షల మంది రైతులకు కలిగే గరిష్ఠ ప్రయోజనం 60 వేల రూపాయలు మాత్రమే.

 విశ్వసనీయత ముఖ్యం

 రాజకీయాలలో ప్రజలలో బలమైన ముద్ర వేసుకోవటానికి, వారి నమ్మకాన్ని చూరగొనటానికి విశ్వసనీయత ముఖ్యం. 2004కి ముందు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన కరువు నెలకొని ఉన్న నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకోవటానికి కాంగ్రెస్ ్ట అధిష్ఠానం అనుమతి లేకపోయినా శాసనసభ ఎన్నికల సందర్భంగా వైఎస్ రాజ శేఖర్ రెడ్డి రైతాంగానికి ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు.

కానీ నాటి ప్రభుత్వం ఈ సబ్సిడీ భారాన్ని మోయ గలిగే స్థితిలో లేదు. ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందనే విమర్శలను తిప్పికొడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి ఉచిత విద్యుత్ హామీని అమలు చేసి చూపెట్టింది. 

 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఏటా ప్రతి ఎకరాకు రూ.15 వేల పెట్టుబడి సహాయం అందిస్తామని రైతు డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు.

కానీ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత రెండు సీజన్లు గడిచాక  సాగు చేసే ప్రతి ఎకరాకు 12 వేలు సహాయం అందిస్తామని ప్రకటించటంతో హామీని తప్పినట్లుగా, రైతాం గంలో విశ్వసనీయత కోల్పోయినట్లుగానే కనిపిస్తుంది. రైతుబంధు పథకం ప్రారంభమైన తర్వాత పెట్టుబడి సహాయం కేసీఆర్ ప్రభుత్వం 2000 రూపాయలు పెంచితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా 2వేలే పెం చిందని రైతులు భావిస్తున్నారు.

భారం తప్పించుకోటానికే ఆంక్షలు!

గత కొంతకాలంగా పార్టీలు ఎన్నికలలో గెలవటానికి పెద్ద ఎత్తున హామీలు ఇస్తున్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వా త వాటిని అమలు చేయటానికి అనేక ఆంక్షలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించి ఒకరకంగా ప్రజలను మో సం చేస్తున్నాయనే చెప్పాలి. పార్టీలుగా ఇచ్చిన హామీలను ప్రభుత్వాలుగా అమలు చేయలేక ఆంక్షలు పెట్టి తప్పించుకో చూ స్తున్నాయి.

ఆంక్షలు పథకాల పారదర్శకతను పెంచాలి కానీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవటానికి ఆంక్షలు పెడితే వాటి లక్ష్యాలు దెబ్బతింటాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రైతు రుణమాఫీ చారిత్రాత్మకమైనది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థాయిలో రుణమాఫీ చేయడం సాహసోపేతమైన చర్య. కానీ పథకం అమలులో పెట్టిన ఆంక్షలు దాని లక్ష్యాన్ని దెబ్బతీసి ప్రభుత్వానికి రావలసిన పేరు రాలేదు, అలాగే వరికి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ కాకుండా సన్నాలకే బోనస్ లాంటి ఆంక్ష లు కూడా ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీశాయి.

ఇక రైతు భరోసా విషయంలో కూడా గందరగోళం ఏర్పడి ప్రభుత్వ ప్రతి ష్ఠ దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. సాగుకే భరోసా అనే ఆంక్ష వలన రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య 69 లక్షల నుం డి యాసంగి  పంట నాటికి 40 లక్షలకు తగ్గిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యం లో ప్రభుత్వంపై రైతులకు అసంతృప్తి కలిగే అవకాశం కూడా ఉంది. 

గత ప్రభుత్వ విధానాలు, కేసీఆర్ చేసిన అప్పుల వల్లనే తాము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను, హామీలను నెరవేర్చలేకపోతున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పటం బాధ్యతనుండి తప్పించుకునే ప్రయత్నంగానే ప్రజలు భావిస్తారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో 56 శాతం గ్రామీణ కుటుంబాలకు భూమి లేదు.

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని వ్యవసాయదారులకు అంటే దాదాపు 14 లక్షల మంది కౌలు రైతులకు, 22 లక్షల మంది వ్యవసా య కూలీలకు కూడా ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఆహ్వానించదగినదే కానీ లబ్ధి దారులను పారదర్శకంగా ఎంపిక చేయకపోతే ప్రభుత్వ ఉద్దేశాలు దెబ్బతినడమే కాదు ప్రభుత్వానికి, పార్టీకి కూడా నష్టం జరుగుతుంది.

         వ్యాసకర్త సెల్: 9885465877