08-08-2025 07:21:41 PM
మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) భూపాలపల్లి మండలం నాగారం గ్రామంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల బెల్లంకొండ రమేష్ కు చెందిన ఇల్లు(గుడిసె) కాలిపోవడం జరిగింది. వెంటనే స్పందించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ ఆయిలి మారుతి శుక్రవారం నాగారం గ్రామం వెళ్లి రమేష్ కుటుంబానికి మనోధైర్యం కల్పించి, నిత్యవసర సరుకులు, పిల్లలకు తల్లిదండ్రులకు వస్త్రాలు, 25 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది. అనంతరం మారుతి మాట్లాడుతూ, నిరుపేదలైన రమేష్ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబాల జగదీష్, మిడిదొడ్ల రఘు, రాకేష్, అంబాల శ్రీకాంత్, బెల్లంకొండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.