28-06-2025 12:47:45 AM
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచన
ఇబ్రహీంపట్నం, జూన్ 27:బోడకొండ జలపాతాన్ని రాచకొండ సీపీ సుధీర్ బాబు సందర్శించారు. శుక్రవారం మంచాల మం డలం బోడకొండలోని జలపాతాన్ని సందర్శించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. వ ర్ష కాలం ప్రారంభ దశలో ఉంది. కవున బో డకొండ జలపాతాన్ని సందర్శించడానికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి జలపాతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులు ఎలాంటి ప్రమాదలకు గురికాకుండా అధికారులకు తగు చర్యలు తీసుకో వాలనీ సూచనలు చేశారు. అలాగే అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మంచాల సీఐ మధు తదితరులు పాల్గొన్నారు.