calender_icon.png 4 June, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని రంగాల్లో తెలంగాణ వెలుగులు

03-06-2025 01:18:35 AM

  1. తెలంగాణ- రైజింగ్ 2047 విజన్‌తో ముందుకు
  2. 7,626 స్వయం సహాయక సంఘాలకు రూ. 765.66 కోట్ల రుణాలు
  3. మహాలక్ష్మి పథకం ద్వారా  రూ. 158.58 కోట్ల లబ్ది
  4. రూ. 605.71 కోట్ల రైతురుణమాఫీ 
  5. జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి కృషి 
  6. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కరీంనగర్, జూన్ 2 (విజయ క్రాంతి): ఎందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అ న్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతోందని, తెలంగాణ రాష్ట్రాన్ని భారత దేశంలోనూ, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానం లో నిలిపేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రై జింగ్ -2047 విజన్‌తో ప్రజా ప్రభుత్వం ముందు కు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు,

శా సనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక, సామాజిక, పరిపాలన రంగా ల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ -2047 విజన్ డాక్యుమెంట్ ను రూ పొందించామని తెలిపారు.

పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక సుపరిపాలన లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్ప టికే పలు చర్యలు చేపట్టిందన్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అం డ్ సోషల్ జస్టీస్ పాలసీ, గ్రీన్ ఎనర్జిపాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరి జం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసిందని, ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత అని, ఇది తెలంగాణ రూ పురేఖలనే మార్చేస్తుందన్నారు.

ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంట మహాలక్ష్మి తాండవిస్తుందని, అందుకే, రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న సం కల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్ర యాణం, 500 రూపాయలకే వంటగ్యాస్ స రఫరా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా, ఇందిరమ్మ ఇళ్ళు వంటి పథకాలతో పాటు, సంపన్నులతో సమానంగా తెలంగా ణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏ ర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

మహిళలు పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ, శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్టాళ్ళను ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి, ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయటం జరిగిందన్నారు. దే శ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో 25 లక్షల 35 వేల 964 మంది రై తులను రుణ విముక్తులను చేయడం జరిగిందన్నారు.

20,617 కోట్ల రూపాయల రుణ మాఫీ చేశామని, రైతుకు పెట్టుబడి సాయం పెంచి, రైతుభరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయలు ఆర్థిక సహాయం అం దిస్తున్నామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ, ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతు ఖాతాలో న గదు జమచేయడం జరుగుతోందని అన్నా రు. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారని, అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10 వేల రూ పాయలు పరిహారం ఇస్తున్నామన్నారు.

రా ష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆ లం, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యే లు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి స త్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రె డ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మ ల్లేశంతోపాటు జిల్లా అధికారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు పాల్గొన్నారు.

అమరుల త్యాగఫలమే తెలంగాణ రాష్ట్రం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కరీంనగర్, జూన్ 2 (విజయక్రాంతి): అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా నగరంలోని అమరవీర స్తూపం వద్ద మంత్రి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రా ష్ట్రం సంబురాలప్పుడూ అమరుల త్యాగాల ను స్మరించుకోవడం మన ధర్మమని, అది వారి త్యాగానికి మనం ఇచ్చే గొప్ప గౌరవమన్నారు. జై తెలంగాణ.. ఇది నినాదం కాదు.. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస అని, అస్తి త్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైత న్య భావోద్వేగం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అసువులు బాసిన త్యాగధనులకు వేల వేల వందనాలనీ,

రవై ఏండ్ల తెలంగాణ అస్తిత్వ ఉద్యమాల్లో వారి పోరా టం అజరామరమని, వారి త్యాగం.. స్ఫూర్తి నిరూపమానమని అన్నారు. జీవితాన్ని త్యా గం చేయడమంటే మాటలు కాదనీ, అయి నా... ఏండ్ల తెలంగాణ కలను నిజం చేయ డం కోసం వారు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యజించారని అన్నారు. నావల్లనై నా తెలంగాణ రాష్ట్రం రావాలనీ విద్యార్థి శ్రీకాంతాచారి, పోలీసు కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, వేణుగోపాల్,

యాదిరెడ్డిలాంటి వందలమంది ప్రాణాలర్పించా రని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో బలిదానాలు చేసుకుంది కేవలం 459 మందే అని కేసీఆర్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందని, కానీ.. ఉవ్వెత్తున ఎగిసిపడ్డ ఉ ద్యమంలో 1200 మంది ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారని ఉద్యమకారులు చె బుతున్నారని తెలిపారు. అమరుల త్యాగాలను ఉజ్వలంగా స్మరించుకోవాలి...

బిడ్డల ను కోల్పోయిన ఆ కుటుంబాలను రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని అన్నారు. తెలంగా ణ అమర వీరుల స్ఫూర్తితో... వారి ఆశయ సాధనకు, వారు కలలు కన్న తెలంగాణ పునర్నిర్మాణానికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నా రు. అనంతరం పోలీస్ సుబ్బారెడ్డి గ్రామం లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అమరవీరుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్ బాబు సన్మానించారు.