20 June, 2026 | 4:06 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

కులగణనకు ఊపిరి పోసిందే రాహుల్

05-11-2024 01:53 AM
  1. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు హర్షణీయం
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా కులగణన పోరాటా నికి సంపూర్ణ మద్దతు తెలియజేసి ఉద్యమానికి ఊపిరి పోసిందే రాహుల్‌గాంధీ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాహుల్‌గాంధీ తెలంగాణకు రావడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.

సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నప్పటికీ కులగణనకు అండగా నిలిచేందుకు రాహుల్‌గాంధీ తెలంగాణకు రావడం చారిత్రాత్మక పరిణామమని పేర్కొన్నారు.

కులగణనకు ఎలాంటి న్యాయపరమైన వివాదాలు తలెత్తకుండా హైకోర్టు తీర్పును అనుసరించి డెడికే టెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్, జాజుల లింగంగౌడ్, మాదేవీ రాజేం దర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.