18 March, 2026 | 3:35 PM

హైకోర్టును ఆశ్రయించిన రాజ్‌తరుణ్

02-08-2024 12:05 AM

తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ సినీ హీరో రాజ్‌తరుణ్‌పై లావణ్య అనే యువతి నార్సింగి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు చేశారు. రాజ్‌తరుణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నార్సింగి ఠాణాలో తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పోలీసుల నుంచి ఆదేశాలు తీసుకోవాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారాని (నేడు)కి వాయిదా వేసింది.