సికిందర్‌కి జోడీగా

10-05-2024 12:05:00 AM

విభిన్నమైన పాత్రలతో వరుస సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటోంది కథానాయిక రష్మిక మందన. ‘పుష్ప’, ‘యానిమల్’ చిత్రాల ద్వారా విశేష ప్రేక్షకాదరణ పొందిన ఆమె తాజాగా మరో భారీ బాలీవుడ్ చిత్రంలో నటించే అవకాశం అందుకున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ దర్శకుడు మురుగదాస్ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. ‘సికిందర్’ పేరిట రానున్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక ఎంపికయ్యారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అయిన నడియడ్‌వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై రష్మిక తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ “మీరెప్పటినుండో కొత్త అప్డేట్ గురించి అడుగుతున్నారుగా.. ఇదిగో” అంటూ ఈ విషయా న్ని అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రటకన వెలువడటం ఆలస్యం.. సల్మాన్ గతంలో వేసిన డ్యాన్సులు, జరిపి న ముచ్చట్ల వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ‘పుష్ప  ది రూల్ ’లో శ్రీవల్లిగా అలరించనున్న రష్మిక, శేఖర్ కమ్ముల ‘కుబేర’ చిత్రంతో పాటు ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’, చావా (హిందీ) చిత్రాల్లో నటిస్తున్నారు.