మధుమేహుల బైపాస్ సర్జరీకి అభయం
డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా నేతృత్వంలో అధ్యయనం
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): మధుమేహ హృద్రోగుల్లో గుండె రక్తనాళాల బైపాస్ సర్జరీ పరంగా దీర్ఘకాలిక ఫలితాలు, ప్రయోజనాలకు సంబంధించి తాజాగా ఒక అధ్యయనం కొనసాగుతోంది. ఐసిఎన్ఆర్ నిధులతో కొనసాగుతున్న ఈ అధ్యయనానికి ప్రముఖ హృద్రోగ నిపుణులు, స్టార్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్, సజ్జా హార్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఛైర్మన్ డాక్టర్ లోకేశ్వరరావు సజ్జా నేతృత్వం వహిస్తున్నారు.
ఇటీవల షికాగో లో జరిగిన అమెరికన్ అసోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీ వార్షిక సదస్సులో ఈ అధ్యయనాన్ని, ఫలితాలనూ ఆయన ఆవిష్కరిం చారు. ‘సాధారణంగా మధుమేహుల్లో ఇన్ఫెక్షన్ భయంతో ఛాతీలోని ఒక మామరీ ధమ నే వాడుతుంటారు. కానీ, రెండు ధమనులను వాడటం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనా లు ఎక్కువగా ఉంటాయని అధ్యయనం చె బుతోంది. ’స్కెలెటనైజ్డ్’ అనే ఆధునిక పద్ధతిలో రక్తనాళాలను సేకరించడం వల్ల, మధు మేహులు అయినప్పటికీ ఛాతీ ఎముక ఇన్ఫెక్షన్ ముప్పును తగ్గించవచ్చు.
కాళ్లలోని సిరల ను వాడినప్పుడు బృహద్ధమని ద్వారా ప్లేక్స్ కదిలి పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. దానికి బదులు ధమనులను వాడటం వల్ల ఈ ముప్పు తప్పుతుంది. భారతీయుల్లో త క్కువ వయసులోనే గుండె జబ్బులు వస్తున్న నేపథ్యంలో, ధమనుల ద్వారా చేసే బైపాస్ ఎక్కువ కాలం (జీవితకాలం) మన్నుతుంది. దీనివల్ల రెండోసారి సర్జరీ అవసరం పడదు. మధుమేహం ఉన్నప్పటికీ సరైన జాగ్రత్తలు తీసుకుని ఒకటి కంటే ఎక్కువ ధమనులను ఉపయోగించడం వల్ల బైపాస్ సర్జరీ ఫలితాలు మరింత మెరుగ్గా, సురక్షితంగా ఉంటా యని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది’ అని వెల్లడించారు.






