28 February, 2026 | 8:52 PM

రికార్డ్ అసిస్టెంట్ ఆత్మ హత్య

28-02-2026 07:11 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట ఎస్ఆర్ఎన్కె ప్రభుత్వ  డిగ్రీ కళాశాలలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ అహ్మద్ (50) శనివారం కళాశాల భవనంపై నుండి దూకి ఆత్మ హత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. రెండంతస్తుల భవన్ పై నుండి కింద దూకగానే తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

అతనికి మద్య సేవించే అలవాటు ఉందని రమజాన్ మాసం ఉండటంతో తాగడంలేదని కొన్ని రోజుల నుండి పరివర్తన విధానం మారి నట్లు సహా ఉద్యోగులు తెలిపారు. శనివారం మృతుడు బాన్సువాడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నాకు నా కుటుంబ సభ్యులు చంపేస్తామని బెదిరిస్తున్నారని చెప్పడనీ  సహా ఉద్యోగులు తెలిపారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉన్నవి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  తెలిపారు.