16 March, 2026 | 11:51 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

పాప విమోచనం

19-07-2024 12:00 AM

పూర్వం ‘జడుడు’ అనేవాడు సకల ఆచారాలను అన్నింటినీ త్యజిస్తాడు. దురాచార పరుడై సంచరిస్తూ ఉంటాడు. ధనాశాపరుడూ అవుతాడు. ఒకనాడు వ్యాపారం కోసం ఉత్తర దిశకు వెళతాడు. అటునుండి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో కొందరు దొంగలు అతనిని చుట్టుముట్టి, ఒక చెట్టు కిందికి తీసుకెళ్లి దారుణంగా చంపేస్తారు. ఏమవుతుంది, అతడు పాపాత్ముడు కనుక, మరణానంతరం పిశాచ రూపాన్ని పొందుతాడు. కొంతకాలానికి ధర్మాత్ముడైన అతని కుమారుడు తండ్రికి ఉత్తర క్రియలు జరపడానికి కాశీకి వెళుతుంటాడు. తోవలో తన తండ్రి హత్యకు గురైన వృక్షం కింద కూర్చుని, అక్కడ భగవద్గీతలోని మూడవ అధ్యాయాన్ని పారాయణం చేస్తాడు. అంతే! వెంటనే జడుని ప్రేతాత్మ రూపం కాస్తా తొలగి పోతుంది. దివ్య దేహంతో స్వర్గానికి వెళుతూ, ఆనందంతో కుమారుని కేసి చూస్తూ అంటాడు, “నాయనా! నువ్వు ఇప్పుడు గీత మూడవ అధ్యాయాన్ని పఠించిన పుణ్యమే నా ప్రేతరూపాన్ని తొలగించింది. కనుక, అత్యంత మహిమాన్వితమైన తృతీయ అధ్యాయాన్ని నువ్వు మరవకుండా నిత్యం పారాయణం చేయవలసింది సుమా!” అని ఆశీర్వదిస్తాడు.

 కలకుంట్ల జగదయ్య