18-12-2025 08:32:20 PM
హనుమకొండ (విజయక్రాంతి): రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతా చర్యలపై పోస్టర్ ప్రదర్శనతో పాటు రోడ్డు భద్రతా గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఆంగ్ల విభాగం, ఎన్ఎస్ఎస్ యూనిట్లు, ఎన్సిసి, లిటరరీ క్లబ్ సహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రదర్శనలను వివరిస్తూ, రోడ్డు భద్రతపై అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన దృక్పథాన్ని ప్రదర్శించారు.
అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుంచి రోడ్డు భద్రత అంశాలపైన అవగాహన కలిగి ఉండడం వల్ల రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సృజనాత్మకతను, నిబద్ధతను అభినందించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నాలను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమం సమన్వయం, సామాజిక బాధ్యత పట్ల కళాశాల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి అధికారులు, ఇంగ్లీష్ విభాగ అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.