18-06-2025 08:32:19 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో బుధవారం ప్రజల ఆందోళన మధ్య రోడ్డు విస్తరణ పనులను అధికారులు చేపట్టారు. రోడ్డు విస్తరణకు గతంలోనే నిర్ణయించగా కొందరు స్వచ్ఛందంగా అధికారులు ఇచ్చిన మార్కింగ్ ప్రకారం సెట్ బ్యాక్ కాగా, మరికొందరు వ్యతిరేకించారు.
ఈ క్రమంలో పలుమార్లు మున్సిపాలిటీ అధికారులు రోడ్డు విస్తరణ కోసం నోటీసులు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో బుధవారం పోలీస్, రెవిన్యూ అధికారుల ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బంది జెసిబి యంత్రాలను తెచ్చి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. రోడ్డు విస్తరణకు శ్రీరామ విలాస్ బజార్ కు చెందిన పలు షాపుల యజమానులు ఆందోళన చేసినప్పటికీ అధికారులు యంత్రాల సహాయంతో రోడ్డు విస్తరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి, సిఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్ఐ సతీష్, రెవిన్యూ అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.