18-06-2025 08:34:35 PM
కోదాడ: కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Womens Engineering College)లో వీడ్కోలు సంబురాలు అంబరాన్ని అంటినాయి. కళాశాలలోని ఇంజనీరింగ్ సివిల్ విభాగం, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం విద్యార్థినులు, ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్న చివరి సంవత్సరం విద్యార్థినులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించినారు. ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ మాట్లాడుతూ... విద్యార్థినులు ఉన్నత ఉద్యోగాలు సాధించి, కళాశాలకు, తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావలన్నారు. కళాశాల డైరెక్టర్, డాక్టర్ సీహెచ్ నాగార్జున రావు, సివిల్ విభాగాధిపతి జనార్దన్, ఎలక్టికల్ విభాగాదిపతి శివాజి, రమేష్, నరేష్ రెడ్డి, స్రవంతి అధ్యాపకులు పాల్గొన్నారు.