31-05-2025 08:40:21 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆధ్యాత్మికత ప్రచారంలో కళాకారుల పాత్ర గొప్పదని పలువురు వక్తలు పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో వివిధ గ్రామాల భజన కళాకారులు ఆధ్యాత్మికత గీతాలు, భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాకారుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గ్రామాలలో ఆధ్యాత్మికత పెంపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమానికి బిజెపి నేత అరిగెల నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ గాధవేని మల్లేష్, కళాకారుల జేఏసీ నాయకుడు మురళీధర్ దేశ్ముఖ పాండే, మంచిర్యాల చైర్మన్ వెంకట చారి, కొమరయ్య, దత్తాత్రేయ, వెంకన్న, సత్తయ్య, రాజబాబు, బాబు చారి, నాగన్న, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, భద్రయ్య, సిహెచ్ రవి, కేరమేరీ, వాంకిడి, రెబ్బెన, ఆసిఫాబాద్ మండలాల నుండి 500 మంది భక్తులు తదితరులు పాల్గొన్నారు.