31-05-2025 08:43:31 PM
కోదాడ పిఎసిఎస్ లో ఘనంగా అంతర్జాతీయ సహకార సంవత్సరం..
కోదాడ: సహకార సంఘాల బలోపేతమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సూర్యాపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు శనివారం కోదాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ సహకార సంవత్సరం సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కోదాడ సొసైటీ అభివృద్ధికి చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస రెడ్డి చేస్తున్న కృషి అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిటర్ పద్మజ కోదాడ మాజీ వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు పారా సీతయ్య , చింతలపాటి శ్రీనివాస్, తోట జ్యోతి శ్రీనివాస్ ,మరియు వైస్ చైర్మన్ నరేష్ ,డైరెక్టర్లు శ్రీరామ్ శెట్టి వెంకటేశ్వర్లు, రమాదేవి ,పార్వతి ,ప్రభాకర్ రావు, వెంకటయ్య, బాబు, శ్రీనివాసరావు, వట్టి సీతారామయ్య, చంద్రమౌళి ,రైతు సోదరులు సిబ్బంది పాల్గొన్నారు.