08-12-2025 12:00:00 AM
బూర్గంపాడు,డిసెంబర్ 7(విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పూజారి రజిత నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వ ర్లుని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు మార్పు మొదలైందని విజ యం సాధించి తన దగ్గరకు రావాలని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మం డల అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, మా జీ పిఎసిఎస్ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ మహమూ ద్ ఖాన్, గ్రామ కమిటీ అధ్యక్షులు ఎడమ కంటి పిచ్చిరెడ్డి, దుగ్గెంపూడి శేశి రెడ్డి,కాటం వెంకట్రామిరెడ్డి, ఎడమ కంటి సుధాకర్ రెడ్డి, పూజారి సర్వేశ్వరరావు పాల్గొన్నారు.