2 March, 2026 | 11:53 PM

జేత్వాన్ బుద్ధ విహార్‌లో ఘనంగా సత్యాగ్రహ దివస్

02-03-2026 09:47 PM

వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ధ విహార్‌లో సోమవారం అంబేద్కర్ సంఘం, భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో అంబేడ్కర్ రామ్ మందిర్ దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించారు. 1930 మార్చి 2న మహారాష్ట్రలోని నాసిక్ పట్టణంలో రామ్ మందిరంలో దళితులకు ప్రవేశాన్ని నిషేధించడాన్ని నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వేలాది అనుచరులతో కలిసి సత్యాగ్రహానికి పూనుకున్నారని నాయకులు గుర్తు చేశారు. ఈ ఉద్యమం ఫలితంగా రామ్ మందిర ప్రవేశానికి అనుమతి లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజును సత్యాగ్రహ దివస్‌గా జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోందని పేర్కొన్నారు.