30-05-2025 10:35:37 AM
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య కు స్వాగతం చెబుదాం
ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పిద్దాం..
నమోదు కొరకు మే 29 నుండి జూన్ 5 వరకు ప్రచార జాత
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు పిలుపు
చర్ల, (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యకు స్వాగతం పలకదు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిద్దామని, ప్రభుత్వ విద్యను కాపాడుకోవాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి(TS UTF State Secretary) రాజు పిలుపునిచ్చారు.టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు కొరకు ప్రచార జాత కార్యక్రమం లో భాగంగా చర్ల మండలంలోని దేవరపల్లి కుదునూరు ఆర్ కొత్తగూడెం సత్యనారాయణపురం త్యాగడచర్ల గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఎస్ యుటిఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచార జాతాను స్థానిక అంబెడ్కర్ సెంటర్ భద్రాచలంలో సీనియర్ నాయకులు పి. లక్ష్మి నారాయణ ప్రారంభించారని ,జిల్లా వ్యాప్తంగా గ్రామాలల్లో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించాలని టిఎస్ యుటిఎఫ్ శ్రేణులు అనగా మే 29 నుండి జూన్ 5 వరకు ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, ఏ ఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు, లైబ్రరీ, లేబరేటరీలతో పాటు ఆటపాటలతో అహ్లాదకరమైన వాతావరణంలో, ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధతో, నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్కులు ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడతాయన్నారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం వారానికి మూడుసార్లు కోడిగుడ్లు రాగి జావ అందిస్తారని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను ఆదరించి పిల్లలను చేర్పించాలన్నారు.
ఫీజుల బాధ లేని ఉచిత విద్య పొందాలని ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ టీచర్ల సంఘం తెలియజేసింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి, వ్యక్తిత్వ వికాసానికి అనువుగా ప్రభుత్వ పాఠశాలలు రూపు దిద్దుకుంటున్నాయని, మన పిల్లలను మన ఊరి బడిలోనే చేర్పించి బడికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే తప్పనిసరిగా బడి నిలబడుతుందన్నారు. ఈ ప్రచార జాతా లో సంఘం జిల్లా అధ్యక్షులు బి.మురళీమోహన్ , ఎఫ్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎన్.కృష్ణ,జిల్లా కార్యదర్శులు డి.తావుర్య,ఎస్. విజయ కుమార్, వెంకటేశ్వర్లు ,చర్ల మండల అధ్యక్షులు కాక రాంబాబు, సకినం. బాలకృష్ణ, రాధ, జలంధర్ , సీనియర్ నాయకులు పి.నరసింహరావు, గోపాలరాజు హిమగిరి , రవికిషోర్, శ్రీలక్ష్మి, వర్షిణి తదితరులు పాల్గొన్నారు