30-05-2025 10:39:01 AM
కట్టుకున్న భార్యను కొట్టి చంపిన భర్త.
నాగర్ కర్నూల్, (విజయక్రాంతి ): కలకాలం తోడుంటానంటూ మనువాడిన భర్త అనుమానంతో కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా కొట్టి చంపాడు. ఈ ఘటన నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం(Peddakothapally mandal) గండ్రవుపల్లి గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొల్ల నాగశేషి తన భార్య ఎల్లమ్మ(40) కు 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కూమార్తె సంతానం కాగా గత కొంత కాలంగా తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానం పెంచుకుని గొడవ పడేవారు. గురువారం రాత్రి కూడా గొడవపడి క్షణికావేషణలు భార్యపై దాడి చేయడంతో మృతి చెందినట్లు తెలిపారు. పదునైన ఆయుదాలతో హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి కొల్లాపూర్ సిఐ మహేష్ తో పాటు పోలీస్ సిబ్బంది చేరుకొని ఆధారాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.