calender_icon.png 24 June, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడిమెట్ల హత్య కేసులో సంచలన విషయాలు

24-06-2025 10:49:12 AM

హైదరాబాద్: జీడిమెట్ల హత్య కేసులో(Jeedimetla Case) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎనిమిది నెలల క్రియేత బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో శివతో పరిచయం ఏర్పడింది. పదో తరగతికే ప్రేమ ఏంటని తల్లి మందలించింది. దీంతో బాలిక వారం క్రితం శివతో వెళ్లిపోయింది.  బాలిక తల్లి ఫిర్యాదుతో జీడిమెట్ల పీఎస్‌లో కేసు నమోదైంది. మూడ్రోజుల క్రితం బాలిక తిరిగి ఇంటికి వచ్చింది. తల్లి అడ్డు తొలగించుకునేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ప్రియుడు శివ సోమవారం సాయంత్రం నల్గొండ నుంచి జీడిమెట్లకు వచ్చాడు. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా శివ వెనుక నుంచి దాడి చేశాడు. అనంతరం  శివ బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని కప్పాడు. బాలిక సుత్తితో తల్లి తలపై కొట్టింది. శివ తమ్ముడు యశ్వంత్‌ కత్తితో పీక కోశాడు. అంజలి చాకలి ఐలమ్మ మునిమనవరాలు అని మృతురాలి సోదరి కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.